Tech News Today Telugu 09-01-2025

Ather నుంచి 450 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటీలు

Tech News Today Telugu 09-01-2025: Ather Energy తన 450 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటీల అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 450 S, 450 X 2.9 kWh, 450 X 3.7 kWh అనే మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 450 S ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించారు. ఇది పాత మోడల్ ధరతో పోలిస్తే రూ.4,400 ఎక్కువ.

Ather-450-colours-Still-White

 


January 14న ఇస్రో కొత్త చీఫ్‌గా V నారాయణన్

జనవరి 14న ఇస్రో కొత్త చీఫ్ బాధ్యతలు చేపట్టనున్న V నారాయణన్‌ను ఇస్రో కొత్త చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుత చైర్మన్ ఎస్. సోమనాథ్ స్థానంలో నారాయణన్ ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నారాయణన్, ఇస్రో చీఫ్‌గా మాత్రమే కాకుండా అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆదేశాల ప్రకారం నారాయణన్ జనవరి 14న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 

v narayanan isro chairman


Redmi Note 13 Pro+ ధరలో భారీ తగ్గింపు

Tech News Today Telugu 09-01-2025: Redmi Note 13 Pro+ 256GB వేరియంట్‌పై భారీ ధర తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల చాలా మంది ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 200MP కెమెరా, బలమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. హై-రిజల్యూషన్ డిస్ప్లే, వేగవంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు Redmi Note 13 Pro+ కేవలం రూ.22,290లకే కొనుగోలు చేయవచ్చు.

Redmi Note 13 Pro+


DUCATI: 14 కొత్త బైక్ల విడుదల

Tech News Today Telugu 09-01-2025: DUCATI ఈ ఏడాది 9 కొత్త మోడల్స్‌తో పాటు 5 లిమిటెడ్ ఎడిషన్ లెగ్జరీ వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అలాగే, భారతదేశంలో తమ డీలర్షిప్లను విస్తరించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రీమియం మోటార్సైకిల్ సెగ్మెంట్లో తన స్థానం మరింత బలపరచడం లక్ష్యంగా డీలర్షిప్ నెట్వర్క్‌ను గణనీయంగా విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.

DUCATI bike


January 22న Samsung Galaxy S25 సిరీస్

Tech News Today Telugu 09-01-2025: శాంసంగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Galaxy S25 సిరీస్ మొబైల్స్ భారతదేశంలో జనవరి 22న విడుదల కానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ సిరీస్‌లో S25, S25+, S25 Ultra అనే మూడు మోడల్స్‌ను విడుదల చేయనున్నారు. ఈ మోడల్స్‌ కోసం భారతదేశంలో బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అదనంగా, శాంసంగ్ ప్రాజెక్ట్ మూహన్ అనే రియాలిటీ హెడ్‌సెట్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేయనుంది.

Samsung galaxy s25


India లో Microsoft 3 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి

Tech News Today Telugu 09-01-2025: భారత్లో క్లౌడ్ మరియు ఏఐ మౌలిక వసతుల విస్తరణ కోసం 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని Microsoft సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. “భారత్లో మునుపెన్నడూ లేని స్థాయిలో మా కార్యకలాపాలను విస్తరిస్తున్నాం. Microsoft అజూర్ సామర్థ్యాన్ని మరింత పెంచుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంస్థను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 2030 నాటికి కోటిమందిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం,” అని ఆయన తెలిపారు. 

Microsoft


Whatsapp లో కొత్త ‘ఫొటో పోల్స్’ ఫీచర్

Tech News Today Telugu 09-01-2025: వాట్సాప్ త్వరలో ‘ఫొటో పోల్స్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా పోల్స్‌లో టెక్స్ట్ అవసరం లేకుండా ఫొటోలను జతచేయడం సాధ్యమవుతుంది. ప్రాథమికంగా ఈ ఫీచర్‌ను ఛానెల్స్‌లో ప్రారంభించి, తర్వాత గ్రూప్ చాట్స్ మరియు పర్సనల్ చాట్స్‌కు విస్తరించనున్నారు. టెక్స్ట్ ద్వారా చెప్పలేని భావాలను ఫొటోల ద్వారా సులభంగా వ్యక్తపరచేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

whatsapp

Latest Telugu News - 16-01-2025 (1)
Latest Telugu News 16-01-2025

UPI మార్కెట్ షేర్: తాజా వివరాలు!

Tech News Today Telugu 09-01-2025: ప్రస్తుతం మనీకి బదులుగా UPI వాడకం మరింత పెరిగింది, దీంతో ప్రతి ప్రాంతంలో కూడా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే, మార్కెట్లో PhonePay నే అత్యధికంగా వాడుతున్నారు. డిసెంబర్ 2024 నాటికి UPI మార్కెట్ షేర్ ప్రకారం Phone Pay 47.7%, Google Pay 36.7%, Paytm 6.87% వాడకం ఉండగా, ఈ ఆప్షన్లలో మీరు ఏ పేమెంట్ యాప్ ఎక్కువగా వాడతారో కామెంట్ చేయండి.

upi


Redmi Note 14 సిరీస్ విడుదల ఎప్పుడంటే?

Tech News Today Telugu 09-01-2025: Redmi Note 14 సిరీస్, అనగా Redmi Note 14 Pro, Redmi Note 14 Pro+, డిసెంబర్ 2024లో భారతదేశంలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లలో కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లతో పాటు రెడ్‌మీ 5 స్మార్ట్‌వాచ్ మరియు రెడ్‌మీ బడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ కూడా విడుదల చేయనుంది. ఇవి ఇప్పటికే ఇండియా, చైనా మార్కెట్లో లాంచ్ కాగా, త్వరలో గ్లోబల్ మార్కెట్లో కూడా అందుబాటులోకి రానున్నాయి.

Redmi Note 14 5G


Xiaomi నుంచి బడ్జెట్ 5G ఫోన్!

Tech News Today Telugu 09-01-2025: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి యొక్క సబ్ బ్రాండ్ రెడ్మీ మరో బడ్జెట్ 5G ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ “Xiaomi 14C” పేరిట వచ్చింది మరియు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4GB+64GB వేరియంట్ ధర రూ.9,999, 4GB+128GB వేరియంట్ ధర రూ.10,999 మరియు 6GB+128GB వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. ఈ ఫోన్ లో 5,160 MAH బ్యాటరీని అందిస్తున్నారు.

Xiaomi 14c mobile


OPPO Reno 13 5G సిరీస్ విడుదల

Tech News Today Telugu 09-01-2025: OPPO Reno 13 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఈ నెల 9వ తేదీన భారతదేశంలో విడుదల చేయబోతోంది. 8GB RAM, 128GB స్టోరేజ్, 256GB స్టోరేజ్ వేరియంట్లతో ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లు ఐవరీ వైట్‌తో సహా రెండు రంగుల్లో లభిస్తాయి. సిగ్నల్ బూస్ట్ X1 చిప్‌తో కూడిన MediaTek Density 8350 SoC ప్రాసెసర్‌తో ఈ మొబైల్ విడుదల అవుతుంది. ఇందులో 5600mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

OPPO Reno13 5G


Tata 2వ స్థానంలో !

Tech News Today Telugu 09-01-2025: డిసెంబర్ 2024 నాటికి టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాలు 44,221 యూనిట్ల వరకు అమ్ముడవుతాయని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది డిసెంబర్ 2023 కంటే 1.7% ఎక్కువ అమ్మకాలు. అంటే 2023 డిసెంబరులో 43,471 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ ఆధారంగా టాటా మోటార్స్ అత్యధిక వాహనాల విక్రయాలలో 2వ స్థానంలో నిలిచింది. మారుతీ సుజుకీ 1,30,115 యూనిట్లతో అగ్రస్థానంలో కొనసాగింది.

Tata group


January 16న ఇండియాలో Realme 14 Pro 5G

Tech News Today Telugu 09-01-2025: ప్రముఖ టెక్ కంపెనీ Realme 14 Pro 5G సిరీస్ స్మార్ట్ఫోన్లను జనవరి 16న భారతదేశంలో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సిరీస్ బేస్ మోడల్ లో MediaTek డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. అలాగే, ప్లస్ వేరియంట్ స్నాప్డ్రాగన్ 75 Gen 3 SoC ను పొందవచ్చని సమాచారం. 6,000 mAh బ్యాటరీలతో 4 వేర్వేరు రంగులలో ఈ సిరీస్ విడుదల కానుంది.

realme 14 Pro 5G


మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. > చదవండి  tech-news-today-telugu-05-01-2025

Hello friends, my name is SUBBARAO K, I am the Writer and Founder of this blog and share all the information related to News & Technology, Make Money Online, Mobiles & Gadgets, Free Ai Tools, Useful Websites & Apps, Internet, Product Reviews, through this website...

Leave a Comment

error: Content is protected !!