Ather నుంచి 450 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటీలు
Tech News Today Telugu 09-01-2025: Ather Energy తన 450 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటీల అప్డేటెడ్ వెర్షన్ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 450 S, 450 X 2.9 kWh, 450 X 3.7 kWh అనే మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 450 S ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించారు. ఇది పాత మోడల్ ధరతో పోలిస్తే రూ.4,400 ఎక్కువ.
January 14న ఇస్రో కొత్త చీఫ్గా V నారాయణన్
జనవరి 14న ఇస్రో కొత్త చీఫ్ బాధ్యతలు చేపట్టనున్న V నారాయణన్ను ఇస్రో కొత్త చైర్మన్గా నియమించారు. ప్రస్తుత చైర్మన్ ఎస్. సోమనాథ్ స్థానంలో నారాయణన్ ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నారాయణన్, ఇస్రో చీఫ్గా మాత్రమే కాకుండా అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆదేశాల ప్రకారం నారాయణన్ జనవరి 14న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Redmi Note 13 Pro+ ధరలో భారీ తగ్గింపు
Tech News Today Telugu 09-01-2025: Redmi Note 13 Pro+ 256GB వేరియంట్పై భారీ ధర తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల చాలా మంది ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ స్మార్ట్ఫోన్లో శక్తివంతమైన 200MP కెమెరా, బలమైన బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. హై-రిజల్యూషన్ డిస్ప్లే, వేగవంతమైన ప్రాసెసర్తో ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు Redmi Note 13 Pro+ కేవలం రూ.22,290లకే కొనుగోలు చేయవచ్చు.
DUCATI: 14 కొత్త బైక్ల విడుదల
Tech News Today Telugu 09-01-2025: DUCATI ఈ ఏడాది 9 కొత్త మోడల్స్తో పాటు 5 లిమిటెడ్ ఎడిషన్ లెగ్జరీ వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అలాగే, భారతదేశంలో తమ డీలర్షిప్లను విస్తరించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రీమియం మోటార్సైకిల్ సెగ్మెంట్లో తన స్థానం మరింత బలపరచడం లక్ష్యంగా డీలర్షిప్ నెట్వర్క్ను గణనీయంగా విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.
January 22న Samsung Galaxy S25 సిరీస్
Tech News Today Telugu 09-01-2025: శాంసంగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Galaxy S25 సిరీస్ మొబైల్స్ భారతదేశంలో జనవరి 22న విడుదల కానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ సిరీస్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ సిరీస్లో S25, S25+, S25 Ultra అనే మూడు మోడల్స్ను విడుదల చేయనున్నారు. ఈ మోడల్స్ కోసం భారతదేశంలో బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అదనంగా, శాంసంగ్ ప్రాజెక్ట్ మూహన్ అనే రియాలిటీ హెడ్సెట్ను కూడా ఈ సందర్భంగా విడుదల చేయనుంది.
India లో Microsoft 3 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి
Tech News Today Telugu 09-01-2025: భారత్లో క్లౌడ్ మరియు ఏఐ మౌలిక వసతుల విస్తరణ కోసం 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని Microsoft సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. “భారత్లో మునుపెన్నడూ లేని స్థాయిలో మా కార్యకలాపాలను విస్తరిస్తున్నాం. Microsoft అజూర్ సామర్థ్యాన్ని మరింత పెంచుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంస్థను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 2030 నాటికి కోటిమందిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం,” అని ఆయన తెలిపారు.
Whatsapp లో కొత్త ‘ఫొటో పోల్స్’ ఫీచర్
Tech News Today Telugu 09-01-2025: వాట్సాప్ త్వరలో ‘ఫొటో పోల్స్’ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా పోల్స్లో టెక్స్ట్ అవసరం లేకుండా ఫొటోలను జతచేయడం సాధ్యమవుతుంది. ప్రాథమికంగా ఈ ఫీచర్ను ఛానెల్స్లో ప్రారంభించి, తర్వాత గ్రూప్ చాట్స్ మరియు పర్సనల్ చాట్స్కు విస్తరించనున్నారు. టెక్స్ట్ ద్వారా చెప్పలేని భావాలను ఫొటోల ద్వారా సులభంగా వ్యక్తపరచేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.
UPI మార్కెట్ షేర్: తాజా వివరాలు!
Tech News Today Telugu 09-01-2025: ప్రస్తుతం మనీకి బదులుగా UPI వాడకం మరింత పెరిగింది, దీంతో ప్రతి ప్రాంతంలో కూడా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే, మార్కెట్లో PhonePay నే అత్యధికంగా వాడుతున్నారు. డిసెంబర్ 2024 నాటికి UPI మార్కెట్ షేర్ ప్రకారం Phone Pay 47.7%, Google Pay 36.7%, Paytm 6.87% వాడకం ఉండగా, ఈ ఆప్షన్లలో మీరు ఏ పేమెంట్ యాప్ ఎక్కువగా వాడతారో కామెంట్ చేయండి.