ఒకే Whatsapp నంబర్… రెండు ఫోన్లలో
29-12-2024 – Tech News Today Telugu: స్మార్ట్ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ వాట్సాప్ యాప్ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు ఒకే నంబర్ను ఒకే ఫోన్లో మాత్రమే వాట్సాప్ ఉపయోగించడం సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు లింక్డ్ డివైస్ ఆప్షన్ ద్వారా అదే నంబర్ను వేరే ఫోన్లలోనూ ఉపయోగించే అవకాశం ఉంది. పొరపాటున ఎవరో వ్యక్తి మీతో పాటు వాట్సాప్ నంబర్ ఉన్న ఫోన్ను తీసుకెళ్లినా, రెండో ఫోన్లో లింక్డ్ డివైస్ ఆప్షన్ ద్వారా వాట్సాప్ను ఉపయోగించి మీ కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించుకోవచ్చు.
AI కారణంగా మానవాళికి ప్రమాదం
29-12-2024 – Tech News Today Telugu: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Ai) వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే, దీని వాడకం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే 30 సంవత్సరాల్లో ఏఐ వల్ల మానవజాతి మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశాలు 10 నుంచి 20 శాతం ఉంటాయని “Ai గాడ్ ఫాదర్”గా పేరుపొందిన జెఫ్రీ హింటన్ పేర్కొన్నారు. Ai వ్యవస్థలను తల్లిగా, వాటిని నియంత్రించే మానవులను పిల్లలుగా ఆయన పోల్చారు. అలాగే, Ai భద్రతకు సంబంధించి ప్రభుత్వాల నియంత్రణ చాలా కీలకమని ఆయన స్పష్టం చేశారు.
PSLV-C60 రేపు రాత్రి ప్రయోగానికి సిద్ధం
29-12-2024 – Tech News Today Telugu: అంతరిక్షంలో నిర్దిష్ట ప్రదేశంలో రెండు స్పేస్ క్రాఫ్ట్లను కలిపేందుకు ఉద్దేశించిన పీఎస్ఎల్వీ-C60ని ఇస్రో సోమవారం ప్రయోగించనుంది. స్పేస్ డాకింగ్ ప్రయోగాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SpaDex మిషన్లో భాగంగా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ఆదివారం రాత్రి ప్రారంభమవుతుంది. తుదిగా సోమవారం రాత్రి 8:58 గంటలకు ఈ మిషన్ నింగిలోకి ప్రయాణించనుంది. స్పేస్ డాకింగ్ ప్రయోగం ఇస్రోకు అత్యంత కీలకంగా మారనుంది.
ఆ Train వేగం గంటకు 450 కీ.మీ
29-12-2024 – Tech News Today Telugu: గంటకు గరిష్ఠంగా 450 KM వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలును చైనా పట్టాలెక్కించింది. CR450 రైలుకు Sun ట్రయల్రన్ నిర్వహించారు. ఇంజిన్ పరీక్షల్లో 400 KM అందుకుంది. గతంలో ప్రవేశపెట్టిన CR400 కంటే 20% ఇంధనాన్ని తక్కువ వినియోగిస్తూ, 12% బరువు తక్కువ ఉండే CR450 బీజింగ్ నుంచి షాంఘైకి (1,214 KM) రెండున్నర గంటల్లో చేరుకోగలదు. ఇది ప్రపంచంలోనే వేగంగా నడిచే ప్యాసింజర్ రైలుగా రికార్డుకెక్కనుంది
jio యూజర్లకు బిగ్ షాక్
29-12-2024 – Tech News Today Telugu: డైలీ డేటా ముగిసినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని జియో తగ్గించింది. ఇప్పటివరకు ఈ వోచర్ల వ్యాలిడిటీ ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసేవరకు ఉండేది. అయితే, ఇప్పుడు రూ.19తో రీఛార్జ్ చేస్తే అందే 1జీబీ డేటాను ఒక రోజుకు మాత్రమే, రూ.29 రీఛార్జ్ డేటా 2జీబీని రెండురోజులపాటే పరిమితం చేశారు. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ మార్పు యూజర్లకు పెద్ద దెబ్బగా మారిందని చెప్పుకోవచ్చు. jio
UPI పేమెంట్లు చేసే వారికి శుభవార్త
29-12-2024 – Tech News Today Telugu: RBI UPI చెల్లింపులపై శుభవార్త చెప్పింది. ఇకపై, థర్డ్ పార్టీ యాప్ లు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) వ్యాలెట్లలో ఉన్న సొమ్ముతో UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటివరకు, PPI సంస్థలు మాత్రమే UPI ద్వారా చెల్లింపులు చేయడానికి అవకాశం కల్పించేవి. తాజా నిర్ణయంతో, ఫోన్పే, పేటీఎం వంటి పలు డిజిటల్ వ్యాలెట్లు ఉన్న యాప్ లలో కూడా ఈ సొమ్మును ఉపయోగించి చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం గిఫ్ట్ కార్డులు మరియు డిజిటల్ వ్యాలెట్లను వాడే వారికి చాలా సౌకర్యాన్ని కలిగిస్తుంది.
New Offer: రూ.277తో రీఛార్జ్ చేస్తే.
29-12-2024 – Tech News Today Telugu: న్యూ ఇయర్ సందర్భంగా BSNL కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.277తో రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 120GB హై-స్పీడ్ డేటా అందుతుంది. రోజుకు గరిష్ఠంగా 2GB డేటా వాడుకోవచ్చు. ఈ ఆఫర్ యొక్క వ్యాలిడిటీ 60 రోజులు ఉంటుంది. BSNL ప్రకటన ప్రకారం, ఈ ఆఫర్ జనవరి 16, 2025 వరకే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే, BSNL సిగ్నల్ సరిగా రాలేదని, నెట్ చాలా స్లో ఉందని కొన్ని కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
Mobile Recharge ధరలు పెంపు?
29-12-2024 – Tech News Today Telugu: టెలికం కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ వెల్లడించింది. వచ్చే ఏడాది డిసెంబరులో 15% వరకు టారిఫ్ పెంచే అవకాశం ఉందని తెలిపింది. ARPU (ఏవరేజ్ రీవెన్యూ పర్ యూజర్) లెవెల్స్ పెంచుకోవడం కోసం టెలికం కంపెనీలు ఈ పద్ధతిని తరచుగా కొనసాగించవచ్చని మోతిలాల్ ఓస్వాల్ పేర్కొంది. గత ఐదేళ్లలో (2019, 2021, 2024) మూడు సార్లు టారిఫ్ పెంచారు. 2019 సెప్టెంబరులో రూ.98 ఉన్న రీఛార్జ్ ప్లాన్ 2024 సెప్టెంబరుకు రూ.193కి చేరుకుంది.
Crypto డీలా: రూ.1.2L నష్టపోయిన Bitcoin
29-12-2024 – Tech News Today Telugu: క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో కాస్త డీలా పడ్డాయి. మార్కెట్ విలువ 1.43% తగ్గి $3.29 ట్రిలియన్గా ఉంది. బిట్కాయిన్ $1492 (రూ.1.2 లక్ష) నష్టపోయింది. ప్రస్తుతం స్వల్పంగా పెరిగి $94,472 వద్ద ట్రేడవుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.23% నష్టంతో $3335 వద్ద కొనసాగుతోంది. BTC, ETH డామినెన్స్ వరుసగా 56.8% మరియు 12.2% గా ఉన్నాయి. BNB, TRX 2% పెరిగాయి, అయితే XRP 1.35%, SOL 2.31%, DOGE 0.55%, AVAX 2.78% మేర తగ్గాయి.
RECORD:10 నిమిషాలకో ₹50L కారు అమ్మకం
29-12-2024 – Tech News Today Telugu: సంపద మరియు సంపన్నుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, లగ్జరీ కార్ల అమ్మకాల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2024లో ప్రతి 10 నిమిషాలకు ఒక 50 లక్షల పైబడిన కారును అమ్మినట్లు సమాచారం. ఇదే కాకుండా, తొలిసారి ఒక సంవత్సరంలో 50 వేల లగ్జరీ కార్ల అమ్మకాలను సాధించింది. 2025లో 54 వేల కార్ల అమ్మకాలు జరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024లో మెర్సిడెస్ బెంజ్ 20 వేల, BMW 12 వేల కార్లను అమ్మినట్టు తెలిసింది. ఇవి సగటున 15% వృద్ధి నమోదు చేశాయి. కాగా, వివిధ కారణాల వల్ల AUDI కార్ల అమ్మకాలు 16% తగ్గినట్లు తెలుస్తోంది.
మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి! ఈ airticle చదవండి ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడానికి 5 మార్గాలు