Tech News Today Telugu – 30-12-2024

Apple యూజర్లకు షాక్.. ఈ ఫోన్ల విక్రయాలు బంద్

Tech News Today Telugu – 30-12-2024. యూజర్లకు Apple షాక్ ఇవ్వనునంది. యాపిల్ కొన్ని ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూరప్ లో ఐఫోన్ 14, ఎస్ఈ ఫోన్లను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రామాణికంగా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనేలా యూరప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణమని సమాచారం. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది.


Clickbait Titles, థంబ్నైల్స్తో సంబంధం లేని కంటెంట్ ఉన్న వీడియోలను తొలగించనున్న YouTube

కంటెంట్ కు సంబంధం లేని క్లిక్బైట్ టైటిల్స్, థంబైనైల్స్ ఉండే వీడియోలను యూట్యూబ్ ఇకపై డిలీట్ చేయనుంది. ఒకవేళ మళ్లీ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఛానలైపై స్ట్రైక్ వేయనుంది. బ్రేకింగ్ న్యూస్, కరెంట్ అఫైర్స్కు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందేలా చూడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని యూట్యూబ్ తెలిపింది. రాబోయే కొన్ని నెలల్లో భారత్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించింది.


Internet లో ఒక్క నిమిషంలో ఏమేం జరుగుతాయి?

డోమో సంస్థ రూపొందించిన “డేటా నెవర్ స్లీప్స్” నివేదిక ప్రకారం, ప్రతి నిమిషానికి గూగుల్లో ప్రజలు 59 లక్షల శోధనలు చేస్తున్నారు. ఒక్కో నిమిషానికి ఫేస్బుక్ & ఇన్స్టాగ్రామ్లో 138.9 మిలియన్ రీల్స్ ప్లే అవుతాయి, లింక్ట్రిన్లో 9 వేల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తారు. ఒక్క నిమిషంలోనే 18.8 మిలియన్ టెక్స్ట్ మెసేజ్లు, 251.1మి ఈ మెయిల్స్ వెళ్తాయి. ఇక యూట్యూబ్లో నిమిషానికి 34,72,222 వీక్షణలు వస్తాయి. Tech News Today Telugu


2024లో Google లో పాకిస్థానీయులు ఎక్కువ వెతికిన టాప్ 10లో 8 భారతీయ సినిమాలు

2024 ఏడాదిలో గూగుల్లో పాకిస్థానీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10లో ఎనిమిది భారత్కు చెందిన షోలు, సినిమాలు ఉన్నాయి. భారతీయ షోలు, సినిమాలైన హీరామండి, 12th ఫెయిల్, యానిమల్, మీర్జాపూర్ సీజన్ 3, స్త్రీ 2, భూల్ భూలయ్యా 3, డంకీ, బిగ్ బాస్ 17 (హిందీ)ని ఆ దేశస్తులు ఎక్కువగా వెతికారు. ఈ జాబితాలో ఇష్క్ ముర్షిద్, కభీ మైన్ కభీ తుమ్ అనే రెండు పాకిస్థానీ షోలు ఉన్నాయి. Tech News Today Telugu – 30-12-2024


World అత్యంత సంపన్నుడైన Elon Musk ఏయే వ్యాపారాలు ఉన్నాయి?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇటీవల 400 బిలియన్ డాలర్ల నికర విలువను దాటిన మొదటి వ్యక్తిగా నిలిచారని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ఫోర్బ్స్ ప్రకారం, 53 ఏళ్ల ఆయన టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరాలింక్, ఎక్స్ఐ, ది బోరింగ్ సహా 7 కంపెనీలకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)కు సీఈఓగా ఉన్న మస్క్, ఆ సంస్థను 2022లో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. Tech News Today Telugu – 30-12-2024


Open Ai పై కాపీరైట్ ఆరోపణలు చేసిన ఇండియా కి చెందిన బాలాజీ అమెరికాలో మృతి

ఓపెన్ఏఐ స్టార్టప్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించిన భారత సంతతికి చెందిన ఆ సంస్థ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ నవంబర్ 26న అమెరికాలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. 26 ఏళ్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని వైద్యులు ధ్రువీకరించగా, తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని పోలీసులు తెలిపారు. అయితే ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా దాఖలైన దావాలలో బాలాజీ కీలక సాక్షిగా ఉన్నారు. Tech News Today Telugu

Latest Telugu News - 16-01-2025 (1)
Latest Telugu News 16-01-2025

Triumph ఆఫర్స్..మరో రెండు రోజులే

Triumph మోటారైసైకిల్స్ తన సంవత్సరాంతపు ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ మరో రెండు రోజులు(డిసెంబర్ 31వ తేదీ) వరకు మాత్రమే అందుబాటులో ఉందని, ఆసక్తి ఉన్న వారు తమకు దగ్గరలోని షోరూమ్లను సందర్శించాలని కంపెనీ సూచించింది. కాగా అన్ని ట్రయంఫ్ బైక్లకు ఆఫర్ వర్తించదని కేవలం స్క్రాంబ్లర్ 400X బైక్పై మాత్రమే రూ. 12,500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చని చెప్పింది. అలాగే ఫ్రీగా యాక్సెసరీలు పొందవచ్చని ప్రకటించింది. Tech News Today Telugu – 30-12-2024


New Year లో TATA నుంచి ఈ కార్లు!

భారతదేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా కార్లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అయితే టాటా.. వచ్చే నూతన సంవత్సరంలో హారియర్, సఫారీ మోడళ్లకు చెందిన ఎలక్ట్రిక్ వెర్షన్లను పరిచయం చేయనుందని తెలుస్తోంది. కానీ దీని ధరతో సహా ఎటువంటి సమాచారం సంస్థ ఇంకా విడుదల చేయలేదు. దీంతో టాటా కార్లు కొనాలనుకునే కస్టమర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. Tech News Today Telugu – 30-12-2024


Amazon లో ఈ Mobile పై డిస్కౌంట్

ప్రముఖ ఈ కామర్స్ సైట్ Amazon లో Samsung Galaxy F55 5G స్మార్ట్ఫోన్పై డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ 8జీబీ RAM.. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999పై 3శాతం తగ్గి ప్రస్తుతం 19,449గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే మరో రూ.2000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్ ను రూ.17,268 ధరకే కొనుగోలు చేయవచ్చు. Tech News Today Telugu


Kia నుంచి కొత్త కారు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ Kia సిరోస్ పేరుతో కొత్త కార్ మోడలు విడుదల చేయనుంది. ఇది 12.3-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో 30-అంగుళాల పొడవైన స్క్రీన్లు కలిగి ఉంది. అలాగే 5 అంగుళాల క్లెమేట్ కంట్రోల్తో వచ్చింది. అదేవిధంగా 12.3 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. కాగా ఈ కారు ధర రూ.10 లక్షలు. దీని బుకింగ్లు జనవరిలో ప్రారంభమవుతాయి. Tech News Today Telugu


చివరిగా ఈ టెక్ న్యూస్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని comment రూపంలో తెలియచేయండి. > టెక్ న్యూస్ 29-12-2024 చదవండి

Hello friends, my name is SUBBARAO K, I am the Writer and Founder of this blog and share all the information related to News & Technology, Make Money Online, Mobiles & Gadgets, Free Ai Tools, Useful Websites & Apps, Internet, Product Reviews, through this website...

Leave a Comment

error: Content is protected !!